Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలి ప్రాంతంలో అల్జీరియా విమాన శకలాల గుర్తింపు!

Webdunia
శనివారం, 26 జులై 2014 (10:59 IST)
అల్జీరియాకు చెందిన ఒక పౌరవిమానమొకటి గురువారం బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వస్తుండగా కుప్పకూలిపోయిన విమాన శకలాలను మాలి ప్రాంతంలో కనుగొన్నారు. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సహా మొత్తం 116 మంది మృత్యువాతపడ్డారు. ఈ విమానం సహారా ఎడారి ప్రాంతంలో కూలి వుండొచ్చని భావిస్తున్నారు. ఈ విమానం కూలిన ప్రాంతంలో ప్రయాణికుల శరీర భాగాలతో పాటు... విమాన శకలాలను కనుగొన్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. 
 
ఈ విమానంలో 51 మంది ఫ్రెంచ్ జాతీయులు, 27 మంది బుర్కినా పాసో పౌరులు, 8 మంది లెబనీసె, ఆరుగురు అల్జీరియన్లు, ఐదుగురు కెనడా పౌరులు, నలుగురు జర్మన్లు, ఇద్దరు లక్సెంబర్గ్‌లు, స్విస్, బెల్జియన్, ఈజిప్టు, ఉక్రెయిన్, నైజీరియన్, కామెరూనియన్, మాలిల దేశాలకు చెందిన ఒక్కో పౌరుడు ఉన్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కాగా, కుప్పకూలిపోయిన విమానం గత పదకొండు సంవత్సరాలుగా ఈ విమానం పనిచేస్తూనే వుంది. చాలా పాతబడిపోయిన ఈ విమానం వాతవరణంలోని పీడనాన్ని తట్టుకోలేక కూలిపోయి వుండొచ్చని తెలుస్తోంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments