Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ ఆస్పత్రిపై అమెరికా బాంబులు.. 19 మంది మృతి : ఖండించిన ప్రపంచ దేశాలు

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (13:21 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఆస్పత్రిపై అమెరికా సేనలు వైమానికి దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు వైద్యులు, రోగులతో సహా మొత్తం 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఈ చర్యను ఐక్యరాజ్య సమితో పాటు.. అనేక ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. 
 
ఆప్ఘనిస్థాన్‌లోని కుందుజ్ ప్రాంతంలో ఈ దాడి జరుగగా, ఈ దాడిని దురదృష్టకరమైన ఘటనగా అమెరికా సైన్యం అభివర్ణిస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ప్రజలకు ముప్పుగా మారిన వారిని లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు జరిపామని, అయితే, సమీపంలోనే ఉన్న ఆసుపత్రిపై బాంబులు పడ్డాయని అందులో పేర్కొంది. అలాగే, ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్టు ప్రకటించారు. 
 
ఇదిలావుండగా, తప్పెక్కడ జరిగిందన్న విషయమై పూర్తి విచారణను పారదర్శకంగా జరపాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. పౌరుల ప్రాణాలను తీసే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించిన యూఎస్ అధ్యక్షుడు బాన్ కీ మూన్, యూఎస్ పై ఆఫ్గన్ ప్రజల నమ్మకాన్ని చెరుపుకోరాదని సూచించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments