Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ల చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న ఇండియన్స్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (14:01 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ తీవ్రవాదుల చెరలో చిక్కుకున్న భారతీయులను భారత వైమానిక దళం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. కాబుల్​ నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం భారత్​కు చేరుకుంది. 
 
ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని హిండన్​ వైమానిక స్థావరంలో ఈ విమానం ల్యాండ్​ అయింది. 107 మంది భారతీయులు సహా మొత్తం 168 మంది వాయుసేన విమానంలో భారత్​కు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో కాబుల్​ నుంచి వచ్చిన వారికి ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
కాగా, ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో అత్యంత దారుణ ప‌రిస్థితులు నెల‌కొనివున్న విషయం తెల్సిందే. అఫ్గాన్ తాలిబ‌న్ ఫైట‌ర్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి అరాచక పాలనలో జీవించలేక ప్రజలు దేశాన్ని వీడుతున్నారు. 
 
ఇప్పటికే ఐఏఎఫ్‌ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్‌ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments