భారత్ సాహసం : సురక్షితంగా పౌరులను తీసుకొచ్చిన కేంద్రం

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:32 IST)
భారత ప్రభుత్వం పెద్ద సాహసమే చేసింది. తాలిబన్ ఆక్రమించుకున్న ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకుని పోయిన పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసి.. 120 మంది అధికారులను భారత్‌కు తరలించారు. 
 
కాబూల్ నుంచి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన సీ -17 యుద్ధ విమానం గుజరాత్‌లోని… జామ్‌నగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో మొత్తం 120 మంది భారతీయ అధికారులను తీసుకొచ్చారు. వారిలో చాలా మంది అక్కడి భారత రాయబార కార్యాలయంలో పని చేసేవారు ఉన్నారు. 
 
సోమవారం సాయంత్రమే వారంతా కాబూల్ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. అమెరికా భద్రత సహకారంతో అప్ఘనిస్తాన్‌లో భారత రాయబారి, ఇతర ఉద్యోగులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం విమానం బయలుదేరే వరకు వారికి భద్రత కల్పించారు. అక్కడి నుంచి వారు సురక్షితంగా భారత్ తీసుకొచ్చారు. కాబూల్‌లోని ఎంబసీ ఉద్యోగులంతా సేఫ్‌గా దేశానికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments