Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో ఆరెంజ్ జ్యూస్ తాగింది.. అంతే ఉద్యోగం పోయింది...

మధుమేహంతో బాధపడుతున్న ఓ ఉద్యోగిని అనారోగ్య కారణం వల్ల ఆరంజ్‌ జ్యూస్‌ తాగేసిందని ఆమెను కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసిన ఘటన అమెరికాలోని టెనెస్సీలో చోటుచేసుకుంది. అమెరికాలో రిటైల్ చైన్ నడుపుతున్న డాలర్ జన

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (13:25 IST)
మధుమేహంతో బాధపడుతున్న ఓ ఉద్యోగిని అనారోగ్య కారణం వల్ల ఆరంజ్‌ జ్యూస్‌ తాగేసిందని ఆమెను కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసిన ఘటన అమెరికాలోని టెనెస్సీలో చోటుచేసుకుంది. అమెరికాలో రిటైల్ చైన్ నడుపుతున్న డాలర్ జనరల్ కు పాఠం నేర్పిందీ ఘటన. కేవలం 1.69 డాలర్ల (సుమారు రూ.115) విలువైన ఆరంజ్ జ్యూస్‌ను ముందు డబ్బు చెల్లించకుండా తాగిందని పనిలోంచి తీసేసిన సంస్థ ఇప్పుడామెకు పరిహారంగా 2,77,656 డాలర్లు (సుమారు రూ.1.86 కోట్లు) పరిహారంగా ఇచ్చుకోనుంది. 
 
ఆ వివరాల్లోకెళ్తే.. 2014 సెప్టెంబరులో ఈ ఘటన జరిగింది. టెనెస్సీలోని మేరీవిల్లేలో డాలర్‌ జనరల్‌ స్టోర్‌లో క్యాషియర్‌గా పనిచేసే మహిళ మధుమేహంతో బాధపడుతోంది. దాంతో కౌంటర్‌ దగ్గర ఎప్పుడూ జ్యూస్‌ పెట్టుకోవాల్సి వచ్చేది. అందుకు స్టోర్‌లోని సూపర్‌వైజర్‌ అంగీకరించలేదు. స్టోర్‌లోని ఉద్యోగులెవరూ అలా చేయడానికి వీల్లేదని చెప్పారు. అయితే ఒక రోజు ఆమె కళ్లు తిరుగుతున్నట్లు అనిపించి వెంటనే అక్కడున్న ఆరంజ్‌ జ్యూస్‌ తాగేసింది. దాని ధర కేవలం 1.69 డాలర్లు (సుమారు రూ.112). తర్వాత దానికి డబ్బు చెల్లిస్తానని చెప్పింది. కొనకముందే డ్రింక్‌ తాగి నిబంధనలు ఉల్లంఘించిందంటూ స్టోర్‌ డిస్ట్రిక్ట్‌ జనరల్‌ మేనేజర్‌ ఆమెను ఉద్యోగంలో నుంచి  తీసేశారు. 
 
దీంతో ఆమె అమెరికాలోని ఈక్వల్‌ ఎంప్లాయిమెంట్‌ ఆపర్చునిటీ కమిషనర్‌(ఈఈఓసీ)ను ఆశ్రయించింది. ఈ కమిషన్‌ సహాయంతో ఆమె కోర్టుకు వెళ్లింది. విచారణ అనంతరం కోర్టు ఆమెకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డాలర్‌ స్టోర్‌ జనరల్‌ మేనేజర్‌ను ఆదేశించింది. అమెరికన్ డిజబిలిటీ చట్టాల ప్రకారం, రుగ్మతలతో ఉన్న ఉద్యోగులు, వారికి సంబంధించిన ఔషధాలు, పానీయాలను పక్కన పెట్టుకునే హక్కును కలిగివుంటారని, ఉద్యోగుల హక్కును డాలర్ జనరల్ కాలరాసిందని జ్యూరీ వ్యాఖ్యానించింది.

27,565 డాలర్లు గతంలో పనిచేసినందుకు చెల్లించాలని, 2,50,000 డాలర్లు నష్టపరిహారం కింద చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మొత్తం 2,77,656 డాలర్లు (సుమారు రూ.1.85కోట్లు) మహిళకు చెల్లించాల్సి వస్తోంది. ఈ తీర్పుపై ఈఈసీఓ హర్షం వ్యక్తంచేసింది. అందరికీ సమాన అవకాశాల గురించి తమ సంస్థ పోరాడుతూనే ఉంటుందని తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments