Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానాటికీ దిగజారిపోతున్న పాక్ ఆర్థిక పరిస్థితి... ఒక్క కోడిగుడ్డు ధర రూ.32

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (13:29 IST)
పాకిస్థాన్ దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది. దీంతో ఆ దేశంలో అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు ఆకాశానికంటుతున్నాయి. దీనికి నిదర్శనమే ఒక కోడిగుడ్డు ధర ఏకంగా రూ.32 పలుకుతుంది. ఈ ధరలతో ఆ దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. 
 
పాకిస్థాన్ దేశంలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండంతో విదేశాల నుంచి దిగుమతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదేశంలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి తాకాయి. ఒక్కో కోడిగుడ్డు ధర రూ.32గా పలుకుతుంది. దీంతో కోడి గుడ్లను కొనాలంటేనే పాక్ ప్రజలు వణికిపోతున్నారు. పౌల్ట్రీ ఫామ్‌లలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతో ప్రస్తుత పరిస్థితికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. 
 
దీంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయని చెబుతున్నారు. 30 డజన్ల గుడ్ల ధర రూ.10500 నుంచి రూ.12500కు పెరుగుతుంది. తీవ్ర ఆ దేశ పాలకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డజను కోడిగుడ్లను రూ.360కు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఈ సంక్షోభ సమయాన్ని రీటైల్ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని దోచుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments