Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాన్ని పక్షి ఢీకొట్టితే రూ.14 కోట్ల నష్టం వాటిల్లుతుందా?

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (10:38 IST)
ప్రచ్ఛన్న యుద్ధకాల సమయంలో అమెరికా అగ్ర నేతలకు రక్షణ కల్పించిన విమానాల్లో ఒకటి బోయింగ్ ఈ-6బి మెర్క్యురీ. ఈ విమానం తయారీకి పది వేల కోట్ల రూపాయల మేరకు ఖర్చు అవుతుంది. అలాంటి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో రూ.14 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. 
 
తాజాగా వెగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని మేరీల్యాండ్‌‌లోని పట్యుక్సెంట్‌ రివర్‌ నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో ఈ నెల 2వ తేదీ ఓ ఘటన జరిగింది. ఈ-6బి మెర్క్యురీ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. 
 
ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా నష్టం మాత్రం భారీగానే జరిగింది. విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతినడంతో ఏకంగా రూ.14 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. విమానం ఖరీదు పదివేల కోట్ల రూపాయలకు పైనే కాగా, ఈ ప్రమాదాన్ని వైమానిక దళం ఎ-క్లాస్ ప్రమాదంగా పేర్కొంది.
 
నిజానికి పక్షి కారణంగా దెబ్బతిన్న విమానానికి చాలా చరిత్ర ఉంది. ఈ-6బి మెర్క్యురీ రకం విమానమైన ఇది  ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా నేతలకు రక్షణ కల్పించింది. అంతేకాదు, అణుదాడులకు కూడా దీనిని ఉపయోగించారు. అలాంటి విమానం చిన్నపాటి పక్షి ఢీకొట్టడంతో అపార నష్టంవాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments