Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో మినీబస్సుల్లో బాంబు పేలుళ్లు- తొమ్మిది మంది మృతి

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (11:26 IST)
ఆప్ఘనిస్థాన్‌లో మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. రంజాన్ సందర్భంగా ప్రయాణికులు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి విడిచిపెట్టడానికి ఇంటికి వెళుతుండగా ఈ బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నట్లు బల్ఖ్ ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఆసిఫ్ వజిరి చెప్పారు. 
 
ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజా ఘటనతో తాలిబన్ బలగాలు అప్రమత్తమయ్యాయి. షియాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్ తెలిపింది.
 
ఇదిలా ఉంటే గతేడాది ఆగస్టులో తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments