Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూఢచర్యం ఆరోపణలు : 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు మరణశిక్ష

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (22:33 IST)
గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో భారత్‌కు చెందిన ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధిస్తూ గురువారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ ఎనిమిది మంది అధికారులు కొన్ని నెలలుగా ఖతార్ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా వీరికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. గూఢచర్యం ఆరోపణలపై వీరికి ఈ శిక్ష పడినట్లు సమాచారం. మరోవైపు, ఈ 8 మంది భారతీయులకు మరణశిక్ష పడినట్లు వార్తలు రావడంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ వార్త తమనెంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపింది. 
 
'నేవీ మాజీ అధికారులకు ఖతర్ కోర్టు మరణశిక్ష విధించిందన్న విషయం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ తీర్పునకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వేచిచూస్తున్నాం. బాధితుల కుటుంబ సభ్యులతోపాటు న్యాయ బృందంతో టచ్‌లో ఉన్నాం. చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాల కోసం అన్వేషిస్తున్నాం. ఈ కేసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. ఈ తీర్పునకు సంబంధించిన విషయాన్ని ఖతర్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం' అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ఈ కేసుపై ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని తెలిపింది.
 
కాగా, ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, భారత్‌కు ఈ అధికారులు.. అల్ దహ్రా సంస్థ‌లో పనిచేస్తున్నారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్‌కు చెందిన ఈ 8 మందిని ఖతర్ అధికారులు ఆగస్టు 2022లో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించారు. 
 
అయితే, వీరంతా భారత అధికారులతో మాట్లాడేందుకు ఖతార్ అనుమతి ఇచ్చింది. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు కలవడంతోపాటు ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. అదేసమయంలో పలుమార్లు బెయిలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వీరి నిర్బంధాన్ని ఖతర్ ప్రభుత్వం పొడిగించింది. చివరకు ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్లింది. ఈ క్రమంలోనే వీరందరికీ అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. వణికిపోతున్న థియేటర్ యజమానులు..

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments