మలేషియా భద్రతా దళాల అదుపులో 60మంది భారతీయులు!

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (08:21 IST)
మలేషియా భద్రతా దళాలు అదుపులో 60 మంది భారతీయులు వున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ భారతీయుడు కొవిడ్-19 లక్షణాలతో మరణించిన ఘటనపై స్పందించిన ఆ దేశ మానవ హక్కుల కమిషన్.. విచారణ చేపట్టింది.

తమిళనాడు, కేరళ, తెలంగాణకు చెందిన చాలా మంది.. హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ఈ ఏడాది మార్చిలో కౌలాలంపూర్ వెళ్లారు. వీరంతా మార్చి రెండోవారం నాటికి తిరిగి ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే కరోనా విజృంభించడంతో మలేషియా ప్రభుత్వం మార్చి 18 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో హాలిడేస్‌ ఎంజాయ్ చేయడం కోసం వెళ్లిన సుమారు 60 మంది భారతీయులు మలేషియాలో చిక్కుకున్నారు.

ఇదే సమయంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం వేసిన మలేషియా ప్రభుత్వం..వారిని అదుపులోకి తీసుకోవడానికి భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కరోనా కారణంగా అక్కడే చిక్కుకున్న 60 మంది భారతీయులను కూడా అక్కడి భద్రతా దళాలు మే 1న అదుపులోకి తీసుకున్నాయి.

ఈ క్రమంలో భద్రతా దళాల అదుపులో ఉన్న చెన్నైకి చెందిన 67ఏళ్ల జీవ్‌దీన్ ఖాదర్ మస్తాన్ కొవిడ్ లక్షణాలతో మరణించారు. మలేషియా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న 60 మంది భారతీయుల్లో 20 మంది మహిళలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం