Webdunia - Bharat's app for daily news and videos

Install App

55కు చేరిన ట్రక్కు బాంబు పేలుడు మృతులు

Webdunia
ఉత్తర ఇరాక్‌లో శనివారం సంభవించిన ట్రక్కు బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 55కు చేరుకుంది. అలాగే గాయపడిన వారి సంఖ్య 200కు చేరుకుంది. ఈనెల 30వ తేదీ నుంచి ఇరాక్‌లోని అమెరికా బలగాలు వైదొలగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పేలుడు జరగడం పలు అనుమానాలకు తెరలేపుతోంది.

కుర్కుక్ నగరానికి సమీపంలోని ఒక మసీదులో ప్రార్థనలు ముగిసిన తర్వాత ఈ శక్తివంతమైన పేలుడు సంభవించింది. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. అలాగే, పేలుడు ధాటికి సమీపంలోని ఎనిమిది ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అపారమైన ఇంధన వనరులు ఉన్న ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు అటు కుర్దులు, ఇటు అరబ్‌లు, తుర్కుమెన్‌లు పోటీ పడుతున్నారు.

దీంతో అమెరికా సైనికులు ఇక్కడ తిష్టవేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాయి. ఈనెలాఖరులో అమెరికా సైనికులు ఇక్కడ నుంచి వైదొలగితే ఇక్కడ తెగల పోరాటాలు ఆరంభమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments