Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్ని ప్రమాదం.. 42 మంది మృతి : అల్జీరియా అడవుల్లో ఘోరం

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (11:24 IST)
ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ కారణంగా ఘోర ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో 25 మంది సైనికులతో మొత్తం 42 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ధ్రువీకరించారు. 
 
ఈ దేశంలోని బెర్బర్స్ పర్వతం, కబైలీ ప్రాంతంలోని అడవుల్లో మంటలు వ్యాపించగా.. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని ఆర్మీ మంగళవారం అర్థరాత్రి ట్వీట్‌ చేసింది. మంటలను అదుపు చేస్తున్న క్రమంలో 25 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
మరో ఏడుగురికి గాయాలైనట్లు జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. కనీసం మరో ఏడుగురు పౌరులు మృతి చెందారని అంతర్గత మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు పేర్కొంది. కబైలీ ప్రాంతంలో, పలుప్రాంతాల్లో మంటలు చెలరేగాయి.
 
అయితే, అడవుల్లో మంటలు చెలరేగడంపై కుట్ర జరిగి ఉండొచ్చని ఇంటీరియర్‌ మినిస్టర్‌ అనుమానం వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. బాధితులకు పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచి 13 ప్రావిన్స్‌ల్లో మంటలు చేలరేగగా అడవులు కాలిబూడిదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments