Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోండురస్ జైలులో మారణహోమం : కొందరిని చంపి .. మరికొందరిని సజీవదహనం చేసి...

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (11:37 IST)
హోండురస్ మహిళా జైలులో మారణహోమం జరిగింది. ఈ జైలులో చెలరేగిన అల్లర్ల కారణంగా 41 మంది మహిళా ఖైదీలు మృత్యువాతపడ్డారు. వీరిలో కొందరిని కాల్చి చంపితే మరికొందరిని సజీవ దహనం చేశారు. ఇంకొందరిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ మారణహోమం హోండురస్ రాజధాని టెగుసిగలప్పకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టమారా జైలులో జరిగింది. 
 
ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో చనిపోయిన 41 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫోరెన్సిక్ బృందం తెలిపారు. హింస తర్వాత జైలు నుంచి పలు తుపాకులు, పెద్ద ఎత్తున కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ హింసా కాండపై హోండురస్ అధ్యక్షుడు సియోమరా కాస్ట్రో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జైలులో ఆధిపత్యం కలిగిన మరాస్ వీధి ముఠాల పనేనని ఆయన తెలిపారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బారియో 18 ముఠా జైలులోని ఖైదీల బ్లాకులోకి చొరబడి కొందరిని కాల్చి చంపేసింది. మరికొందరిని తగలబెట్టింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments