Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోండురస్ జైలులో మారణహోమం : కొందరిని చంపి .. మరికొందరిని సజీవదహనం చేసి...

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (11:37 IST)
హోండురస్ మహిళా జైలులో మారణహోమం జరిగింది. ఈ జైలులో చెలరేగిన అల్లర్ల కారణంగా 41 మంది మహిళా ఖైదీలు మృత్యువాతపడ్డారు. వీరిలో కొందరిని కాల్చి చంపితే మరికొందరిని సజీవ దహనం చేశారు. ఇంకొందరిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ మారణహోమం హోండురస్ రాజధాని టెగుసిగలప్పకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టమారా జైలులో జరిగింది. 
 
ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో చనిపోయిన 41 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫోరెన్సిక్ బృందం తెలిపారు. హింస తర్వాత జైలు నుంచి పలు తుపాకులు, పెద్ద ఎత్తున కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ హింసా కాండపై హోండురస్ అధ్యక్షుడు సియోమరా కాస్ట్రో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జైలులో ఆధిపత్యం కలిగిన మరాస్ వీధి ముఠాల పనేనని ఆయన తెలిపారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బారియో 18 ముఠా జైలులోని ఖైదీల బ్లాకులోకి చొరబడి కొందరిని కాల్చి చంపేసింది. మరికొందరిని తగలబెట్టింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments