Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌ వాటర్ ఫెస్టివల్- 285 మంది మృతి.. 1073 మందికి గాయాలు..

మయన్మార్‌లో ప్రతీ ఏడాది సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ వాటర్ ఫెస్టివల్. ఈ పండుగలో ఈ ఏడాది విషాదం చోటుచేసుకుంది. ప్రతి ఏడాది కొత్త సంవత్సరంలో వేసవి ముగిసే సమయంలో ఈ ఫెస్టివల్‌ను అట్టహాసంగా జరుపుకుంటారు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (17:52 IST)
మయన్మార్‌లో ప్రతీ ఏడాది సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ వాటర్ ఫెస్టివల్. ఈ పండుగలో ఈ ఏడాది విషాదం చోటుచేసుకుంది. ప్రతి ఏడాది కొత్త సంవత్సరంలో వేసవి ముగిసే సమయంలో ఈ ఫెస్టివల్‌ను అట్టహాసంగా జరుపుకుంటారు. అయితే నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో 285 మంది మృతి చెందారు. మరో 1073 మంది గాయపడ్డారు.  
 
మయన్మార్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌ను థింగ్యాన్ అని పిలుస్తారు. బౌద్ధాన్ని అనుసరించేవారు ఈ వేడుకను జరుపుకుంటారు. గత సంవత్సరం చేసిన పాపాలు కొత్త సంవత్సరంలో నీటితో కడిగేసుకుంటే పోతాయనే విశ్వాసంతో ఈ వేడుక జరుగుతుంది. అయితే గత ఏడాది ఈ వేడుకలో 272 మంది మరణించగా, ఈ ఏడాది దారుణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి 1,200 క్రిమినల్ కేసులు నమోదైనాయని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments