Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సముద్రంపై తేలియాడిన 26మంది అమ్మాయిల మృతదేహాలు?

మధ్యదరా సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా 26మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. 14 నుంచి 18ఏళ్ల మధ్య గల టీనేజర్లైన అమ్మాయిల మృతదేహాలు సముద్రంపై తేలుతూ కనిపించడంతో అధికారులు షాక్ అయ్యార

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (16:55 IST)
మధ్యదరా సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా 26మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. 14 నుంచి 18ఏళ్ల మధ్య గల టీనేజర్లైన అమ్మాయిల మృతదేహాలు సముద్రంపై తేలుతూ కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక సిబ్బంది సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
నైజర్, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులుగా సముద్రంలో తేలియాడిన టీనేజర్లు వుండొచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిబియా నుంచి ఓడలో యూరప్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఇకపోతే.. లుబియాలో అమ్మాయిల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుంది. వివిధ దేశాల నుంచి ఇక్కడకు అమ్మాయిలను తీసుకొచ్చి వారిని లైంగికంగా వేధిస్తుంటారు. ఇటీవలి కాలంలో చాలా మంది అమ్మాయిలను సహాయ సిబ్బంది రక్షించారు. ఈ నరకం నుంచి తప్పించుకునేందుకు కొందరు అమ్మాయిలు ఇలా ప్రమాదకరంగా సముద్రాన్ని దాటే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయివుంటారని స్థానిక అధికారులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం