Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సముద్రంపై తేలియాడిన 26మంది అమ్మాయిల మృతదేహాలు?

మధ్యదరా సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా 26మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. 14 నుంచి 18ఏళ్ల మధ్య గల టీనేజర్లైన అమ్మాయిల మృతదేహాలు సముద్రంపై తేలుతూ కనిపించడంతో అధికారులు షాక్ అయ్యార

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (16:55 IST)
మధ్యదరా సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా 26మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. 14 నుంచి 18ఏళ్ల మధ్య గల టీనేజర్లైన అమ్మాయిల మృతదేహాలు సముద్రంపై తేలుతూ కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక సిబ్బంది సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
నైజర్, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులుగా సముద్రంలో తేలియాడిన టీనేజర్లు వుండొచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిబియా నుంచి ఓడలో యూరప్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఇకపోతే.. లుబియాలో అమ్మాయిల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుంది. వివిధ దేశాల నుంచి ఇక్కడకు అమ్మాయిలను తీసుకొచ్చి వారిని లైంగికంగా వేధిస్తుంటారు. ఇటీవలి కాలంలో చాలా మంది అమ్మాయిలను సహాయ సిబ్బంది రక్షించారు. ఈ నరకం నుంచి తప్పించుకునేందుకు కొందరు అమ్మాయిలు ఇలా ప్రమాదకరంగా సముద్రాన్ని దాటే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయివుంటారని స్థానిక అధికారులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం