Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే యేడాది కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయ్!

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (10:42 IST)
ఈ యేడాది నమోదైన ఉష్ణోగ్రతలతో దేశ ప్రజలు తల్లడిల్లి పోయిన విషయంతెల్సిందే. ముఖ్యంగా వేసవి కాలంలో ఉక్కపోతను భరించలేక వందలాది మంది మృత్యువాతపడ్డారు. దీంతో 2015 సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ తెలిపింది.
 
2015లో ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఏడాది సముద్ర ఉపరితలు గరిష్టస్థాయిలో నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ సంస్థ అధిపతి మిచెల్ జరాడ్ ఒకప్రకటనలో తెలిపారు. భూగ్రహానికి ఇది దుర్వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. 19వ శతాబ్దం మధ్యకాలంతో పోలిస్తే భూమి ఉపరితల ఉష్ణోగ్రత ఒక సెల్సియస్ డిగ్రీ పెరిగిందని తెలిపారు.
 
వాతావరణ మార్పులపై పారిస్‌లో ప్రపంచదేశాల శిఖరాగ్ర సభ మరోవారం రోజులలో జరుగుతుందనగా జరాడ్ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అలాగే, వచ్చే యేడాది (2016) కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో పాటు.. మానవ ప్రేరేపిత భూతమే ఇందుకు కారణమని ప్రపంచ వాతావరణ సంస్థ తేల్చిచెప్పింది.

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

Show comments