Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై రష్యా సైనిక దాడి-200 టెర్రరిస్టులు హతం

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:13 IST)
సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై రష్యా జరిపిన దాడిలో సుమారు 200 మంది తీవ్రవాదులు మృతి చెందినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో 24 వాహనాలు ధ్వంసం అయ్యాయని, మరో అర టన్ను పేలుడు పదార్ధాలు ధ్వంసం అయినట్లు సైన్యం పేర్కొంది. 
 
సిరియా ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగినట్లు రష్యా అడ్మిరల్‌ అలక్సందర్‌ కార్పొవ్‌ దృవీకరించారు. సిరియాకు ఈశాన్యంలో ఉన్న పల్మైరాలో పలు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని.. ఇక్కడ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని అన్నారు. 
 
ఇక్కడ అక్రమంగా పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించామని, ఈ ప్రాంతం సిరియా ఆధీనంలో లేదని రష్యా ఆర్మీ తెలిపింది. అర టన్ను పేలుడు పదార్థాలు ధ్వంసమైనట్లు రష్యా వైమానిక దళం అధికారి అలక్సందర్ కార్పోవ్ తెలిపారు. 
 
పల్మైరా ప్రాంతంలో ఉగ్రవాదులు శిక్షణ పొందుతుండడంతో పాటు భారీ మొత్తంలో మందు గుండు సామాగ్రి తయారు చేస్తుండడంతో దాడులు జరిగినట్టు సమాచారం. 2015 నుంచి సిరియాలో ఉగ్రవాదులపై రష్యా సైన్యం దాడులు చేస్తోంది. ఇద్దరు రష్యా సైనికులను గతంలో చంపడంతో ఈ దాడులకు రష్యా పాల్పడుతున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments