Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో భారీ వర్షాలు- 80 మంది మృతి.. 16మంది గల్లంతు

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2023 (13:20 IST)
Floods
చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చైనాలోని ఉత్తర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో సామాన్యుల జనజీవనం పూర్తిగా స్తంభించింది. చాలా మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైనారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. 
 
విద్యుత్‌ అంతరాయంతో పలు ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. అయితే నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా చైనాలో ఇప్పటివరకు 78 మంది చనిపోయారు. చాలా మంది అదృశ్యమయ్యారు.
 
ఈ స్థితిలో ఉత్తర చైనాలోని జియాంగ్సు నగరంలో శనివారం ఉదయం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ఇళ్లు భూమిలో కూరుకుపోయాయి. ఆ ఇళ్లపై బురద పడి ఇద్దరు వ్యక్తులు దారుణంగా మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. 
 
ఈ విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం, అగ్నిమాపక సిబ్బంది కొండచరియలు విరిగిపడిన ఇళ్ల శిథిలాలను తొలగించేందుకు రంగంలోకి దిగారు. ప్రాణాలతో పోరాడుతున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. 
 
గల్లంతైన కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments