Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో విషాదం - చెరువులో పడిన బస్సు - 17 మంది మృతి

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (09:44 IST)
బంగ్లాదేశ్‌లో విషాదం ఘటన జరిగింది. కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది జల సమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటోకు దారి ఇస్తుండగా, బస్సు అదుపుతప్పిన బస్సు చెరువులో పడిపోయింది. 
 
భండారియా ఉప జిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు 70 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి ఝలకతి సదర్ ఉప జిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. మృతుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు. స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 
 
క్షతగాత్రులతు ఝలకతి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో పరిమితికి మంచిన ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments