Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై వర్చువల్‌గా సామూహిక అత్యాచారం.. ప్రపంచంలోనే తొలి కేసు

Webdunia
గురువారం, 4 జనవరి 2024 (08:41 IST)
యూకేకు చెందిన మైనర్ బాలికపై వర్చువల్‌గా అత్యాచారం జరిగింది. ఈ తరహా కేసు జరగడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. మెటావర్స్‌లో గేమ్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. బాలిక అవతార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఘటన తర్వాత తీవ్ర మానసిక గాయాన్ని అనుభవిస్తుందని పేర్కొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలిక వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరించి ఆటలో లీనమై ఉన్న సమయంలో కొంతమంది యువకులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. బాలిక శరీరంపై ఎలాంటి గాయలు లేనప్పటికీ వాస్తవ ప్రపంచంలో అత్యాచారం జరిగినట్టుగానే ఆమె వ్యవరిస్తోందని, ఆమె తీవ్రమైన మానసిక గాయాన్ని అనుభవిస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.
 
ఇలాంటి కేసును పోలీసులు దర్యాప్తు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. బాధిత బాలికకు అయిన మానసిక గాయం చాలాకాలం పాటు ఆమెను వెంటాడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టంలో ఇటువంటి వాటికి సంబంధించి ఎలాంటి నిబంధన లేనందున దీనిపై పోలీసులు ముందుకు ఎలా వెళ్తారన్నది సర్వత్ర చర్చనీయాంశమైంది. కాగా, బాధిత బాలిక ఆ సమయంలో ఎలాంటి గేమ్ ఆడుతోందన్న విషయంలో స్పష్టత లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments