Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచుకొస్తున్న ముప్పు.. మానవజాతికి మూడనుంది!

భూగోళానికి ముప్పు ముంచుకొస్తోంది. మనుష్య జాతి దుశ్చర్యలతో భూగోళానికి పెను ముప్పు ఏర్పడింది. దీని ఫలితంగా భవిష్యత్‌లో మానవజాతి పూర్తిగా అంతరించిపోనుంది. భూమిపై జీవవైవిధ్యం కొరవడుతుందని, పునరుద్ధరించడాన

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (14:55 IST)
భూగోళానికి ముప్పు ముంచుకొస్తోంది. మనుష్య జాతి దుశ్చర్యలతో భూగోళానికి పెను ముప్పు ఏర్పడింది. దీని ఫలితంగా భవిష్యత్‌లో మానవజాతి పూర్తిగా అంతరించిపోనుంది. భూమిపై జీవవైవిధ్యం కొరవడుతుందని, పునరుద్ధరించడానికి అత్యవసరంగా మరిన్ని చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఈ మేరకు 184 దేశాలకు చెందిన 15 వేల మంది శాస్త్రవేత్తలు సంతకాలు చేసిన ఓ లేఖ "వార్నింగ్ టు హ్యుమానిటీ: ఏ సెకండ్" నోటీస్ పేరుతో బయోసైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమైంది. 
 
1992లో పలు దేశాలకు చెందిన 1,700 మంది శాస్త్రవేత్తలు ఇలాంటి హెచ్చరికలే జారీ చేస్తూ అంతర్జాతీయ సమాజానికి వార్నింగ్ టు హ్యుమానిటీ పేరుతో లేఖ రాశారు. భూగోళంపై మానవజాతి మనుగడ కొనసాగాలంటే ప్రకృతివనరుల విధ్వంసాన్ని ఆపాలని సూచించారు. తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రెండో హెచ్చరిక జారీ చేస్తూ లేఖ రాసింది. 
 
1992 నాటితో పోలిస్తే పరిస్థితులు మరింత దిగజారాయని హెచ్చరించారు. జనాభా విస్ఫోటనం ప్రధాన సమస్యగా మారిందని, 1992 తర్వాత రెండున్నర దశాబ్దాల్లో 200 కోట్ల జనాభా పెరిగిందన్నారు. భూతాపం పెరిగిపోతుందని ఫలితంగా ఎవరెస్ట్‌పై మంచు వేగంగా కరుగుతున్నదన్నారు. వ్యవసాయంలో విచ్చలవిడి రసాయనాల సాగు, అడవుల నరికివేత, జల కాలుష్యం ప్రధాన సమస్యలుగా పరిణమించాయన్నారు. 
 
జలవనరుల్లో జీవజాతులు అంతరిస్తున్నాయని, సముద్రాలు నిర్జీవంగా మారుతున్నాయని వివరించారు. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా మండించడంతో వాతావరణంలోకి గ్రీన్‌హౌజ్ వాయువులు చేరి ముప్పుగా పరిణమిస్తున్నాయని, మన ఇంటికి మనమే నిప్పు అంటించుకుంటున్నామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments