పాకిస్థాన్‌ను తాలిబన్ ఫైటర్లు ఆక్రమిస్తారా?

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (16:23 IST)
పాకిస్థాన్ - ఆప్ఘనిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లోని బార్మల్ జిల్లాల్లో పాకిస్తాన్ సైనికులు జరిపిన వైమానికి దాడులపై ఆప్ఘనిస్థాన్ పాలకులు కన్నెర్ర జేశారు. పాక్ వైమానిక దాడుల్లో 46 మంది ముఖ్యంగా మహిళలు, చిన్నారులు చనిపోవడంతో తాలిబన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడులను అనాగరిక చర్యగా పేర్కొనడంతో పాటు పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరించింది. 
 
అఫ్ఘానిస్థాన్‍‌లోని పాక్ రాయబారిని కూడా పిలిచి తీవ్ర నిరసన తెలిపింది. ఆ వెంటనే సుమారు 15 వేల మంది తాలిబాన్ ఫైటర్లు కాబుల్, కాందహార్, హెరాత్ నుంచి పాకిస్థాన్‌లోని ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్‌లో మీర్ అలీ సరిహద్దు వైపు కదులుతున్నారు. అయితే తాలిబాన్ల శిక్షణ శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిపామని పాక్ వాదిస్తోంది. అసలే సరిహద్దు వెంబడి ఉన్న తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)తో పడలేకపోతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం కూడా శత్రువుగా మారింది. దీంతో ఇద్దరు శత్రువులను ఎదుర్కోవడం పాకిస్థాను సవాలేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments