Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ను తాలిబన్ ఫైటర్లు ఆక్రమిస్తారా?

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (16:23 IST)
పాకిస్థాన్ - ఆప్ఘనిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లోని బార్మల్ జిల్లాల్లో పాకిస్తాన్ సైనికులు జరిపిన వైమానికి దాడులపై ఆప్ఘనిస్థాన్ పాలకులు కన్నెర్ర జేశారు. పాక్ వైమానిక దాడుల్లో 46 మంది ముఖ్యంగా మహిళలు, చిన్నారులు చనిపోవడంతో తాలిబన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడులను అనాగరిక చర్యగా పేర్కొనడంతో పాటు పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరించింది. 
 
అఫ్ఘానిస్థాన్‍‌లోని పాక్ రాయబారిని కూడా పిలిచి తీవ్ర నిరసన తెలిపింది. ఆ వెంటనే సుమారు 15 వేల మంది తాలిబాన్ ఫైటర్లు కాబుల్, కాందహార్, హెరాత్ నుంచి పాకిస్థాన్‌లోని ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్‌లో మీర్ అలీ సరిహద్దు వైపు కదులుతున్నారు. అయితే తాలిబాన్ల శిక్షణ శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిపామని పాక్ వాదిస్తోంది. అసలే సరిహద్దు వెంబడి ఉన్న తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)తో పడలేకపోతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం కూడా శత్రువుగా మారింది. దీంతో ఇద్దరు శత్రువులను ఎదుర్కోవడం పాకిస్థాను సవాలేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments