Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- 12 మంది మృతి

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (16:35 IST)
Nepal
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసకూలీలతో వెళ్తున్న ఓ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతి చెందారు. మరో 29 మంది గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. నేపాల్‌లోని సల్యాన్‌ జిల్లాకు చెందిన కొంతమంది కార్మికులు ఉపాధి కోసం భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో గల బరేచ్‌ జిల్లాకు వలస వచ్చారు. ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో వీరంతా ఓ ప్రైవేటు వాహనంలో స్వస్థలానికి పయనమయ్యారు.
 
అయితే ఆదివారం అర్ధరాత్రి నేపాల్‌లోని బాంకే జిల్లా అడవి సమీపంలోకి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టింది. దాంతో పెద్ద ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడిక్కడే మరణించారు. గాయపడిన వారిని నేపాల్‌గంజ్ నగరంలోని భేరి ఆసుపత్రికి తరలించారు అని బాంకే జిల్లా అధికారి రాంబహాదూర్ కురుంగ్వాంగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments