Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో కరోనాతో 11మంది భారతీయుల మృతి.. టర్కీ ఆ లిస్టులో చేరిపోయింది..

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (09:18 IST)
corona hospital
సౌదీ అరేబియాలో కరోనా బారిన పడి 11మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయభార కార్యాలయం ధ్రువీకరించింది. ఇప్పటివరకు 11 మంది భారతీయులు కోవిడ్‌తో మరణించగా.. వీరిలో మదీనాలో నలుగురు, మక్కాలో ముగ్గురు, జెడ్డాలో ఇద్దరు, రియాద్‌, డామ్మమ్ లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. 
 
ఏప్రిల్ 22 వరకు ఈ మరణాలు నమోదయ్యాయి. లాక్ డౌన్ కారణంగా భారత్‌కు విమానాల సర్వీసుల రాకపై నిషేధం ఎత్తివేయలేమని ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులను తరలించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట వేయడం కుదరడం లేదు. మొత్తం 210 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించగా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,04,676కు చేరింది. వీరిలో 1,90,549 మంది మృత్యువాతపడగా.. 7,38,032మంది కోలుకున్నారు. 
 
ఇక దేశాల వారీగా అగ్రరాజ్యం అమెరికాలో 8,89,568పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 81,792మంది కోలుకోగా.. 50,177 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో అమెరికా తరువాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, లండన్‌ దేశాలు ఉండగా.. తాజాగా టర్కీ ఆ లిస్ట్ లో చేరింది.
 
అలాగే 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఇరాన్‌, చైనా, రష్యా దేశాలు కొనసాగుతున్నాయి. ఇక వైరస్‌ పుట్టిన చైనాలో ప్రస్తుతం 82,810కేసులు ఉన్నాయి. ఇక భారతదేశంలో 21,700 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments