Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో బయల్పడిన 1300 ఏళ్ల నాటి ఆలయం.. అది విష్ణుమూర్తి ఆలయమట!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (17:34 IST)
భారత్-పాకిస్థాన్ దాయాది దేశాలు. ఒకప్పుడు కలిసున్న దేశాలు ప్రస్తుతం విడిపోయాయి. తాజాగా పాకిస్థాన్‌లో పురావస్తు శాఖ తవ్వకాల్లో 1300 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం బయటపడింది.

వాయవ్య పాకిస్థాన్‌లోని స్వాట్ జిల్లాలో బరీకోట్ ఘుండాయ్ దగ్గర పాక్‌, ఇటలీకి చెందిన పురావస్తుశాఖ నిపుణులు తవ్వకాలు జరిపారు. ఇది శ్రీమహావిష్ణువు ఆలయం అని ఖైబర్ పక్తుంక్వా పురావస్తు శాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్‌ వెల్లడించారు. హిందూ షాహి రాజ్యంలో 1300 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు.
 
ఈ హిందూ షాహీస్ లేదా కాబూల్ షాహీస్ ఒక హిందూ రాజ్యవంశం. క్రీస్తు శకం 850-1026 మధ్య ఈ వంశస్థులు కాబూల్ లోయ, గాంధారా (ఇప్పటి పాకిస్థాన్‌), వాయవ్య భారత్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆలయ పరిసరాల్లో కంటోన్మెంట్‌, వాచ్‌టవర్ జాడలు కూడా పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కిందటి పురావస్తు ప్రదేశాలు ఉండగా.. తొలిసారి హిందూ షాహీస్ నాటి జాడలు కనిపించాయని ఆ అధికారి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments