Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిల్లరీ భారత పర్యటనపై తర్జన భర్జనలు: అమెరికా

Webdunia
అమెరికా విదేశాంగశాఖామంత్రి హిల్లరీ క్లింటన్ వచ్చే వారం భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆమె కాంగ్రెస్ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరు దేశాల సత్సంబంధాలు, దిశానిర్దేశాలు ఎలా ఉండాలనేదానిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

భారతదేశంలో జరిపే పర్యటన చారిత్రాత్మకమౌతుందని దీనిపై గత కొద్ది రోజులుగా హిల్లరీ వివిధ కాంగ్రెస్ సభ్యులతో సంప్రదింపులు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇయాన్ కేలీ విలేకరులకు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె బుధవారంనాడు ఉదయం అల్పాహార సమయంలో సెనేట్ సభ్యులు, వైట్‌హౌస్ ప్రతినిధులతో విదేశీ వ్యవహారాల కమిటీలోని ప్రముఖులు జాన్ కైరీ మరియు హావర్డ్ బర్మన్ తదితర కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారని కేలీ తెలిపారు.

ఇరు దేశాల సంబంధాలు ఏ మార్గంవైపు పయనించాలోకూడా ఆమె ఈ సభ్యులతో చర్చించినట్లు కేలీ పేర్కొన్నారు.

ఇదిలావుండగా విదేశీ వ్యవహారాలను చూసే మరికొంతమంది నిపుణులతోకూడా ఆమె సంప్రదింపులు జరిపినట్లు కేలీ తెలిపారు.

కాగా హిల్లరీ క్లింటన్ పర్యటన సందర్భంగా అణుశక్తి విషయం చర్చలకు వస్తుందా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments