Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్ ఫ్లూ మరణం: అమెరికా ప్రభుత్వంపై దావా

Webdunia
అమెరికాలో స్వైన్ ఫ్లూ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబసభ్యులు న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టులో దావా వేశారు. ప్రభుత్వం నుంచి 40 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని డిమాండ్ చేయడం ఈ దావా ఉద్దేశంగా తెలుస్తోంది. బుధవారం ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికాలో తొలి స్వైన్ ఫ్లూ మరణం న్యూయార్క్‌లో నమోదయింది.

న్యూయార్క్‌లోని క్వీన్స్ పాఠశాలలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న మిచ్ వీనెర్ మేలో స్వైన్ ఫ్లూ కారణంగా మరణించారు. అంతకుముందు వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు న్యూయార్క్ నగరంలోని అనేక పాఠశాలలను స్థానిక ప్రభుత్వం మూసివేసింది. ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కువగా స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే మరిన్ని పాఠశాలలను అధికారిక యంత్రాంగం మూసివేయకపోవడం వలనే తన భర్త మరణించాడని వీనెర్స్ భార్య, ఆయన ముగ్గురు పిల్లలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మృతుడి కుటుంబసభ్యులు న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.

ఈ దావా ద్వారా న్యూయార్క్ స్థానిక ప్రభుత్వాన్ని, దాని ఆరోగ్య, విద్యా విభాగాలను కోర్టులో నిలబెట్టాలని వారు భావిస్తున్నారు. నగర యంత్రాంగం మరిన్ని పాఠశాలలు మూసివేసే దిశగా సత్వర చర్యలు తీసుకొని ఉండాల్సింది. స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వీనర్స్ మృతి చెందాడని పిటిషన్‌లో మృతుడు కుటుంబసభ్యులు పేర్కొన్నట్లు సీబీఎస్ టెలివిజన్ నెట్‌వర్క్ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments