Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వస్థలాలకు వెళుతున్న తమిళ శరణార్థులు

Webdunia
శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ఎల్టీటీఈ, సైన్యం మధ్య ఇటీవల ముగిసిన యుద్ధం కారణంగా ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్న తమిళ పౌరులు తిరిగి స్వస్థలాలకు వెళుతున్నారు. ఈ ఏడాది మేలో ఎల్టీటీఈ, సైన్యం మధ్య యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంకలో 30 ఏళ్లపాటు సాగిన పౌర యుద్ధానికి పూర్తిగా తెరపడింది.

శ్రీలంక సైన్యం దేశంలో ఎల్టీటీఈ ప్రాబల్యాన్ని తుడిచిపెట్టేందుకు చేపట్టిన తుది దశ పోరు కారణంగా వేలాది మంది తమిళ పౌరులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరణార్థ శిబిరాలకు వెళ్లారు. వీరు తిరిగి స్వస్థలాలకు చేరుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం గత కొన్నివారాలుగా ఏర్పాట్లు చేస్తోంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో బుధవారం 1100 మంది తమిళ శరణార్థులను స్వస్థలాలకు పయనమయ్యారు. శరణార్థ శిబిరాల నుంచి తమిళ పౌరులు అధికారికంగా స్వస్థలాలకు తిరిగి వెళ్లడం ఇదే తొలిసారి. తొలి విడతలో బయలుదేరిన పౌరులు ట్రింకోమలే, అంపారా, బట్టికాలోవా, కంటాలే ప్రాంతాలకు చెందినవారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

Show comments