Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వస్థలాలకు చేరిన 16 లక్షల పాక్ శరణార్థులు

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2009 (19:00 IST)
స్వాత్ లోయలో పాకిస్థాన్ సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ టెర్రరిస్ట్' కారణంగా తమ ఆవాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న 23 లక్షల మంది శరణార్థుల్లో 16 లక్షల మంది శరణార్థులు తిరిగి తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీంతో 13 శరణార్థ శిబిరాలను మూసి వేసినట్టు చెప్పారు.

స్వాత్ లోయలోని వివిధ ప్రాంతాల్లో తాలిబాన్ తీవ్రవాదులు తిష్టవేసి దుశ్చర్యలకు పాల్పడుతూ వచ్చిన విషయం తెల్సిందే. వీరిని ఏరివేసేందుకు పాక్ సైన్యం రంగంలోకి దిగింది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో నివశించే ప్రజల్లో 23 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వీరికోసం ప్రత్యేకంగా సమితి శరణార్థ శిబిరాలను ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో తీవ్రవాదులను ఏరివేసిన తర్వాత తిరిగి శరణార్థులు తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నట్టు సమితి వెల్లడించింది. దీనికి సంబంధించి న్యూయార్క్‌లో సమితి ప్రతినిధి విలేకరులతో మాట్లాడుతూ.. శరణార్థుల్లో 16 లక్షల మంది సొంత ప్రాంతాలకు చేరుకున్నారని చెప్పారు. భద్రత దృష్ట్యా మిగిలిన శరణార్థుల కోసం ఇంకా 17 శిబిరాలను కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments