Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ ఒప్పంద సమీక్ష: భారత్, నేపాల్ అంగీకారం

Webdunia
సరిగ్గా 59 సంవత్సరాల క్రితం భారత్, నేపాల్‌ల మధ్య కుదిరిన శాంతి మరియు స్నేహ ద్వైపాక్షిక ఒప్పందాలను సమీక్షించేందుకు ఇరు దేశాలు అంగీకారం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో హిమాలయా ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా సమీక్షించాలని భారత్, నేపాల్ నిర్ణయించాయి.

అంతకుముందు 1950లో భారత్, నేపాల్‌ల మధ్య ఈ శాంతి, స్నేహ ఒప్పందం కుదిరింది. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లోను భారత్ జోక్యం చేసుకునేలా ఈ ఒప్పందం ఉన్నట్లు ఇటీవల విమర్శలు వస్తుండటంతో.. దీన్ని ప్రస్తుతం సమీక్షించాల్సిన అవసరం ఉందని ఇరు దేశాలు భావించాయి.

నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ నాయర్ ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటన ముగుస్తున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి భారత్, నేపాల్‌లు ఓ సంయుక్త ప్రకటనను చేశాయి. భారత్, నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శులు 1950 నాటి శాంతి, స్నేహ ఒప్పందంపై సమీక్షించనున్నట్లు తెలిపాయి.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేలా ఈ సమీక్ష ఉంటుందని సమాచారం. భారత్‌పై వ్యతిరేక కార్యకలాపాలను సాగించేందుకు తమ భూభాగంలోకి ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని మాధవ్ కుమార్.. భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments