Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివక్ష దాడుల్లో బలవుతున్న భారతీయులు

Webdunia
WD
ఆస్ట్రేలియాలో భారతీయులపై జాతి వివక్ష దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం విఫలమవుతోంది. ఇదిలావుండగానే ఆస్ట్రేలియాలో విదేశీయులపై 2007 నవంబరు నుంచి 2008 నవంబరు వరకూ జరిగిన దాడుల్లో కనీసం 50 మంది విదేశీయులు మృతి చెందారని అక్కడి ప్రముఖ పత్రిక అయిన "సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్" ప్రచురించింది.

ఈ విషయాన్ని ఆసీస్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడానికి వెనుకాడుతోందనీ, దీనికి కారణం విదేశీ విద్యార్థుల ద్వారా వచ్చే 15.5 బిలియన్ డాలర్లను ఎక్కడ కోల్పోవలసి వస్తుందోనన్న భయమని ఆ పత్రిక పేర్కొంది.

ఆస్ట్రేలియాలో గత ఏడాది విదేశీయులపై జరిగిన దాడుల్లో 50 మంది విద్యార్థులు మృతి చెందగా అందులో 25మంది భారతీయులేనని ఆ పత్రిక పేర్కొంది. ఈ గణాంకాలను ప్రభుత్వం నుంచి సేకరించి ప్రచురించినట్లు తెలిపింది. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య 150కి పైగానే ఉండవచ్చని తెలుస్తోంది.

భారతీయ విద్యార్థుల అనంతరం అధిక సంఖ్యలో మృతిచెందినవారు చైనా, కొరియా దేశస్థులని తేలింది. దీనిపై ఆస్ట్రేలియా పార్లమెంటులో చర్చ సాగింది. విపక్ష నేతలు విదేశీ విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరాయి.

ప్రతిపక్ష నేతల అడిగిన ఒక ప్రశ్నకు ఆ దేశ విద్యాశాఖా మంత్రి సమాధానమిస్తూ... విదేశీ విద్యార్థుల భద్రకు సంబంధించిన చట్టాన్ని ఈ ఏడాది మరోసారి సమీక్షించి వారి రక్షణకు అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments