Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాతావరణ మార్పులపై తక్షణ చర్య అవసరం

Webdunia
ప్రపంచంలోని మూడు బిలియన్ల మంది చిన్నారుల ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో పాల్గొన్న 13 ఏళ్ల భారత బాలిక ఇందులో మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని సూచించింది. 100 దేశాల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న వారిలో అమెరికా, చైనా అధ్యక్షులు కూడా ఉన్నారు.

వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ దేశాల నేతలకు తెలియజేసిన ఈ బాలిక.. మన భవిష్యత్ తరాలు మనల్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వరాదని తెలిపింది. ప్రస్తుతం వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేసేందుకు మరింత నిర్మాణాత్మక చర్యలు అవసరాన్ని తానిప్పుడు ప్రశ్నిస్తున్నట్లు.. మన భవిష్యత్ తరాలు మనల్ని ప్రశ్నించకుండా చూసుకోవాలని లక్నోకి చెందిన యుగ్రత్న శ్రీవాత్సవ ఈ సదస్సులో సూచించింది.

హిమాలయాలు కరిగిపోతున్నాయి. ధృవాల్లో ఎలుగుబంట్లు చనిపోతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఇద్దరికి సురక్షిత త్రాగునీరు అందడం లేదు. భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. పలు జంతు, వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి. ఫసిఫిక్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఇదేనా మనం మన భవిష్యత్ తరాలకు అందించబోయేది అంటూ శ్రీవాత్సవ ప్రశ్నించింది. లక్నోలోని సెయింట్ ఫిడెలిస్ పాఠశాలలో శ్రీవాత్సవ తొమ్మిదో తరగతి చదువుతుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

Show comments