ఆస్కార్ అవార్డుల ప్రదాన వేడుక ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి) అంగరంగ వైభవంగా ప్రారంభంకానుంది. లాస్ఏంజిల్స్స్లోని డాల్బీ థియేటర్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉత్తమనటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం తదితర కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ముఖ్యంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు ఎవరు అందుకుంటారా? అని సంగీత అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ యేడాది ఈ కేటగిరిలోనే హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ రేసులో ఫ్రోజెన్ చిత్రంలోని లెట్ ఇట్గో పాట మొదటిస్థానంలో ఉంది. ఇడినా మెంజెల్ గానం చేసిన ఈ పాట యూట్యూబ్లో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన విషయం తెల్సిందే.
భారత్ తరపున ప్రముఖ సంగీతదర్శకుడు, గాయకుడు శంకర్ మహాదేవన్ గానం చేసిన ముఝ్సే హోగీ షురువాత్ గీతం కూడా హానెస్టీ ఆస్కార్స్ విభాగంలో నామినేట్ అయింది. మా గీతం ఆ స్కార్హానెస్టీ అవార్డుకు నామినేట్ అయింది. ఈ పాటకు ఓట్ చేయండి అంటూ మహదేవన్ గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు.