అమెరికా సేనల చేతిలో హతమైన ఆల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్లాడెన్ కుటుంబ సభ్యులను వారి స్వదేశాలకు పంపించి వేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్థాన్లో లాడెన్ తలదాచుకున్నదానిపై దర్యాప్తు జరిపిన ఆ దేశ జ్యుడీషియల్ కమిషన్ లాడెన్ కుటుంబ సభ్యులను స్వదేశీ పయనంపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో పాక్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్లో అబొట్టాబాద్లో లాడెన్ దాగివుండగా, అమెరికా దాడిలో హతమయ్యాక అతని ముగ్గురు భార్యలు (వీరిలో ఇద్దరు సౌదీ జాతీయులు, ఒకరు యెమెన్ జాతీయురాలు), పిల్లల్లో కొందరిని పాక్ భద్రతా సంస్థలు కస్టడీలోకి తీసుకుంది. వీరి అప్పగింత ఏర్పాట్ల కోసం తమ అధికారులు సౌదీ, యెమెన్ అధికారులను సంప్రదించారని పాక్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.