Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక స్థానిక ఎన్నికలు: మీడియాపై నిషేధం

Webdunia
శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రత్యేక తమిళ దేశాన్ని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతం నుంచి గత మూడు దశాబ్దాలుగా ఎల్టీటీఈ తీవ్రవాద గ్రూపు పోరాటం జరిపిన సంగతి తెలిసిందే.

ఎన్నో ఏళ్లపాటు ఎల్టీటీఈ ఆధీనంలో ఉండి, ప్రభుత్వ పాలనకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఎల్టీటీఈ తిరుగుబాటును శ్రీలంక సైన్యం పూర్తిగా అణిచివేసిన సంగతి తెలిసిందే.

సమస్యాత్మక ఉత్తర ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ దళాల ఆధీనంలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రధాన నగరాల్లో శనివారం స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పరిశీలించేందుకు శ్రీలంక ప్రభుత్వం మీడియాను అనుమతించడం లేదు.

వావూనియా, జాఫ్నా నగరాల్లోకి విలేకరులకు ప్రవేశం లేకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. 25 ఏళ్ల పౌర యుద్ధానికి సాక్ష్యంగా నిలిచిన ఈ రెండు నగరాల్లో శనివారం జరిగే స్థానిక ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య బీజాలు పడనున్నాయి.

ఈ ఎన్నికల సందర్భంగా మీడియాపై నిషేధం విధించడానికి ప్రభుత్వం ఎటువంటి కారణం వెల్లడించలేదు. భద్రతాపరమైన కారణాల వలన ఇతరులెవరినీ ఈ ప్రాంతంలోకి అనుమతించడం లేదని ప్రభుత్వం చెబుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments