Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక సైనికుల తాజా పోరులో 44 మంది మృతి

Webdunia
శ్రీలంక ప్రభుత్వ దళాలు శుక్రవారం ఎల్టీటీఈ వద్ద నుంచి కీలక గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ఎల్టీటీఈకి, ప్రభుత్వ దళాలకు మధ్య జరిగిన తాజా పోరులో 44 మంది తీవ్రవాదులు మృతి చెందారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఎల్టీటీఈ గోదాములుగా ఉపయోగించుకుంటున్న ఆనందపురం గ్రామంలోకి ప్రభుత్వ దళాలు గురువారం ప్రవేశించాయని మిలటరీ ప్రతినిధి బ్రిగేడియర్ ఉదయ నానాయక్కరా తెలిపారు. ఈ గ్రామాన్ని ప్రభుత్వ దళాల చేతిలోకి చేరకుండా ఉండేందుకుగాను ఎల్టీటీఈ గట్టిగా ప్రతిఘటించింది. ఈ సందర్భంగా జరిగిన పోరులో ఇద్దరు ఎల్టీటీఈ సీనియర్ నేతలతోపాటు, 44 మంది తీవ్రవాదులు మృతి చెందారని వెల్లడించారు.

ఇదిలా ఉంటే శ్రీలంకలో ఎల్టీటీఈ ఆధీనంలో ఇప్పుడు ఎనిమిది చదరపు మైళ్ల భూభాగం మాత్రమే ఉంది. ఎల్టీటీఈకి, ప్రభుత్వ దళాలకు మధ్య యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో 150000 మంది పౌరులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి, విదేశీ సహాయక సంస్థలు అంచనా వేస్తున్నప్పటికీ, శ్రీలంక ప్రభుత్వం మాత్రం ఈ సంఖ్యలో సగంకంటే తక్కువ మంది మాత్రమే అక్కడ ఉన్నారని చెబుతోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments