పాకిస్థాన్ దేశంలోని రావల్పిండి లోనున్న ఆర్మీ ప్రధాన కార్యాలయంపై తీవ్రవాదులు శనివారంనాడు దాడులకు పాల్పడ్డారు. ఆర్మీ సిబ్బందిపై తీవ్రవాదులు గ్రేనేడ్లతో దాడులకు పాల్పడ్డారు.
పాకిస్థాన్ దేశంలోని రావల్పిండి లోనున్న ఆర్మీ ప్రధాన కార్యాలయంపై తీవ్రవాదులు శనివారంనాడు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ దాడులకు పాల్పడ్డారు. వీరు కార్యాలయంలోకి చొరబడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
ఆర్మీ సిబ్బందిపై తీవ్రవాదులు గ్రేనేడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి.
అయితే భద్రతా దళాలు వారిని సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఉగ్రవాదుల్లో కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నట్లు ప్రాథమిక సమాచారం.