Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్: వైమానిక దాడుల్లో 30 మంది తీవ్రవాదుల హతం

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2011 (10:48 IST)
దక్షిణ యెమెన్‌లో జరిగిన వైమానిక దాడుల్లో అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న 30 మంది తీవ్రవాదులు హతమయినట్లు మిలిటరీ, మెడికల్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల్లో ఎనిమిది మంది సైనికులు కూడా చనిపోయారు.

అబయాన్ ప్రావిన్స్ రాజధాని జింజిబార్‌కు సమీపంలో మిలిటెంట్ల లక్ష్యంగా బుధవారం దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రవాదులకు పెనుదెబ్బ అయిన ఈ దాడిలో మరో 40 మంది తీవ్రవాదులు గాయపడినట్లు కూడా వారు తెలిపారు. జింజిబార్‌కు సమీపంలోని దుఫాస్ ప్రాంతంలో ఎనిమిది మంది సైనికులు చనిపోయినట్లు అధికారులు చెప్పారు.

దక్షిణ యెమెన్‌లోని జింజిబార్‌తో పాటు పలు పట్టణాలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ దళాలు భూతల, వైమానిక దాడులతో వారిని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నాయి. మధ్యప్రాశ్చ దేశమైన యెమెన్‌లో అధ్యక్షుడు అలీ అబ్దుల్లాహ్ సలేహ్ వైదొలగాలని ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments