Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహసూద్ మరణం పెద్ద గిఫ్ట్: హోల్‌బ్రూక్

Webdunia
తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ అధిపతి బైతుల్లా మెహసూద్ మరణం పాకిస్థాన్‌లో తీవ్రవాదులపై జరుగుతున్న యుద్ధంలో చోటుచేసుకున్న కీలక పరిణామమని రిచర్డ్ హోల్‌బ్రూక్ తెలిపారు.

అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) జరిపిన డ్రోన్ (మానవరహిత యుద్ధ విమానం) దాడిలో మెహసూద్ గత బుధవారం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.

మెహసూద్ మరణించాడని అమెరికా, పాక్ యంత్రాంగాలు చెబుతుండగా, తాలిబాన్ మాత్రం అతను బతికే ఉన్నాడని ప్రకటించారు. ఇదిలా ఉంటే గడిచిన నెల రోజుల్లో రెండోసారి పాక్ పర్యటనకు విచ్చేసిన ఆఫ్ఘన్- పాక్ అమెరికా ప్రత్యేక రాయబారి రిచర్డ్ హోల్‌బ్రూక్ గురువారం మాట్లాడుతూ.. సీఐఏ డ్రోన్ దాడిలో బైతుల్లా మెహసూద్ మృతి చెందడాన్ని కీలక పరిణామంగా వర్ణించారు.

మరోవైపు తీవ్రవాదంతో సతమతమవుతున్న ఈ ప్రాంతంలో తాలిబాన్ల మధ్య ఇప్పుడు నాయకత్వ పోరు జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇది కూడా మంచి వార్తేనని రిచర్డ్ హోల్‌బ్రూక్ పేర్కొన్నారు. మెహసూద్ మరణం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పడం కష్టమన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments