Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహసూద్ బతికే ఉంటే నిరూపించండి: పాక్

Webdunia
తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ బతికే ఉన్నాడని ఆ తీవ్రవాద సంస్థ చేస్తున్న ప్రకటనలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద గ్రూపు అధిపతి బైతుల్లా మెహసూద్ గత బుధవారం అమెరికా డ్రోన్ (మానవరహిత యుద్ధ విమానం) జరిపిన క్షిపణి దాడిలో మృతి చెందాడని పాక్ అధికారిక వర్గాలు ధృవీకరించిన సంగతి తెలిసిందే.

అయితే అనంతరం తాలిబాన్ గ్రూపు ప్రతినిధులు తమ నేత బతికే ఉన్నాడని ప్రకటించారు. ఈ ప్రకటనలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. బైతుల్లా మెహసూద్ బతికే ఉంటే, ఆధారాలు చూపించాలని పాక్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. తమ వద్ద పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ మృతి చెందాడనేందుకు విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని తెలిపింది.

జులై 5న పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికా జరిపిన క్షిపణి దాడిలో మెహసూద్ మృతి చెందాడని పాకిస్థాన్, అమెరికా అధికారిక వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. అయితే తాలిబాన్ అగ్రనేత మెహసూద్, అతని ముఖ్య అనుచరుడు హకీముల్లా ఇద్దరూ బతికే ఉన్నారని తాలిబాన్ కమాండర్లు తరువాత ప్రకటనలు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments