Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడుసార్లు పాక్ అణు కేంద్రాలపై దాడులు

Webdunia
పాకిస్థాన్‌లోని అణు కేంద్రాలపై తీవ్రవాదులు గత రెండేళ్లలో మూడుసార్లు దాడులు చేశారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను తాము ఆధీనంలోకి తీసుకుంటామని తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాద సంస్థలు గతంలో పలుమార్లు బెదిరించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ అణ్వాయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే పాక్ ప్రభుత్వం మాత్రం తమ అణ్వాయుధ సంపద సురక్షితంగా ఉందని హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో.. పాక్ అణు కేంద్రాలపై గత రెండేళ్లలో మూడుసార్లు తీవ్రవాదులు దాడి చేసినట్లు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిటన్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ షౌన్ గ్రెగోరీ ఈ విషయాన్ని వెల్లడించారు.

నవంబరు 1, 2007న సార్గోధాలో ఉన్న అణు క్షిపణి నిల్వ కేంద్రంపై దాడి జరిగింది. అనంతరం డిసెంబరు 10, 2007న కమ్రాలోని పాక్ అణు వైమానిక స్థావరంపై కూడా ఆత్మాహుతి దాడి జరిగిందని షౌన్ గ్రెగోరీ చెప్పారు. ఆగస్టు 20, 2008న వాఘ్ కంటోన్మెంట్ వద్ద ఉన్న ఆయుధాగారాల ప్రవేశ ద్వారాలను పాకిస్థాన్ తాలిబాన్ గ్రూపుకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులు పేల్చివేశారు. వాఘ్ కంటోన్మెంట్ వద్దే పాకిస్థాన్ ప్రధాన అణ్వాయుధ కేంద్రం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments