Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబయి ఉగ్రవాద దాడుల్లో లష్కరే ప్రమేయం

Webdunia
గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లడించింది. ముంబయి ఉగ్రవాద దాడులతోపాటు, ప్రపంచవ్యాప్తంగా వివిధ తీవ్రవాద దాడులకు లష్కరే తోయిబానే కుట్ర పన్నిందని పేర్కొంది.

ముంబయి, లండన్, మాడ్రిడ్, బాలిల్లో జరిగిన తీవ్రవాద దాడుల్లో లష్కరే ప్రమేయం ఉందని ఈ నివేదిక తెలిపింది. ఈ తీవ్రవాద సంస్థకు పాకిస్థాన్‌లోని సమస్యాత్మక గిరిజన ప్రాంతాల్లో మూలాలు ఉన్నాయని సీఐఏ మాజీ డైరెక్టర్ చెప్పినట్లు బ్రిటన్ విదేశీ వ్యవహారాల కమిటీ తన నివేదికలో పేర్కొంది.

పాకిస్థాన్ గిరిజన ప్రాంతాల్లోనే లండన్, మాడ్రిడ్, బాలి, ఇస్లామాబాద్, జర్మనీ, డెన్మార్క్‌‍లలో తీవ్రవాద దాడులకు కుట్ర జరిగిందని "అంతర్జాతీయ భద్రత: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్" అనే పేరుతో రూపొందించిన బ్రిటన్ నివేదిక వెల్లడించింది. పశ్చిమ దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకొని గత ఏడాది ముంబయిలో జరిగిన ఉగ్రవాదుల దాడికి కూడా లష్కరే తోయిబానే సూత్రధారి అని పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments