Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత కలహాలను అణిచివేస్తాం: హూ

Webdunia
చైనాలోని జిన్‌జియాంగ్‌లో చెలరేగిన మత ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ కలహాల్లో 156 మంది మృతి చెందగా, వెయ్యి మందికి పైగా గాయాల పాలైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా జీ-8 సదస్సులోపాల్గొన్న చైనా అధ్యక్షుడు హూ జింటావో పరిస్థితిని చక్కబెట్టేందుకు తన పర్యటనను అర్థాంతరంగా ముగించేసుకుని తిరిగి చైనాకు వచ్చేశారు. ఈ మతకలహాలను అణిచేస్తామని జింటావో శపథం చేశారు.

చైనాలో ఆయిల్‌ రిచ్‌గా పేరు పొందిన జిన్‌జియాంగ్‌లో హాన్స్‌ చైనీయులు, యుగ్యుర్‌ ముస్లింలు ఒకరికి ఒకరు ఏమాత్రం తీసిపోని రీతిలో రెచ్చిపోయి మత ఘర్షణలకు దిగడంతో చైనా ప్రభుత్వం ఆందోళనకు గురవుతోంది.

అత్యవసరంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించి ఈ మత ఘర్షణలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుని దేశ భద్రతకు లోటు కలగకుండా ఉండేందుకు, మత కలహాలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments