Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సరిహద్దులను ఉల్లంఘించలేదు: చైనా

Webdunia
భారత్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును తమ దళాలు ఉల్లంఘించాయని వస్తున్న ఆరోపణలను చైనా ప్రభుత్వం తోసిపుచ్చింది. జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని లడక్ ప్రాంతంలో చైనా దళాలు భారత భూ సరిహద్దును ఉల్లంఘించి 1.5 కిలోమీటర్ల మేర సరిహద్దులోపలికి చొచ్చుకొచ్చాయని ఆర్మీ అధికారులు వెల్లడించినట్లు ఆదివారం మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆ ప్రాంతమంతా చైనా దళాలు ఆ దేశం పేరును రాళ్లపై, గుట్లపై ఎరుపు పెయింట్‌‌తో రాశాయని సరిహద్దు భద్రతా దళ సిబ్బంది జులై 31న గుర్తించారని భారత మీడియా పేర్కొంది. ఈ వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. భారత భూభాగంలోకి తమ ఆర్మీ చొరబడలేదని స్పష్టం చేసింది. ఇవి నిరాధారమైన వార్తలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. చర్చల ద్వారా సరిహద్దు సమస్యకు స్నేహపూరిత పరిష్కారాన్ని కనుగొంటామని తెలిపింది.

చైనా, భారత్‌లు అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించిన చుమర్ సెక్టార్‌లోని మౌంట్ గ్యా సమీపంలో చైనా దళాలు సరిహద్దును అతిక్రమించి 1.5 కిలోమీటర్ల మేర లోపలికి వచ్చాయని అధికారిక వర్గాలు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా చైనా పేరును ఈ ప్రాంతమంతా రాళ్లు, గుట్టలపై ఎర్రటి స్ప్రే పెయింట్‌తో రాశారని భారత మీడియా వెల్లడించింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments