Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత అభివృద్ధికి తోడ్పడండి: ప్రతిభాపాటిల్

Webdunia
FILE
బ్రిటన్ పర్యటన నిమిత్తం వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ ఇటీవల నోబెల్ పురస్కార గ్రహీత వి.రామకృష్ణన్‌తోపాటు ఇతర ప్రవాస భారతీయులు కలిసి భారతదేశంలో ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఆమె వారికి సూచించారు.

బ్రిటన్‌లో భారత దౌత్యాధికారి రాష్ట్రపతికి గౌరవార్థం ఇచ్చిన విందులో పాటిల్‌తోపాటు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తూ... భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని, దీనికి ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడు కలిసి ముందుకు రావాలని వారికి ఆమె పిలుపునిచ్చారు.

విదేశాలలోవున్న ప్రవాస భారతీయులు తమ దేశాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పాటునందిస్తారని తాను ఆశిస్తున్నాని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇదిలావుండగా గడచిన ఇరవై సంవత్సరాలలో భారతదేశపు రాష్ట్రపతి బ్రిటన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

కాగా బ్రిటన్‌లోని మ్యారియేట్ లగ్జరీ హోటల్‌లో నిర్వహించిన ఈ విందు భోజన కార్యక్రమంలో లార్డ్ స్వరాజ్ పాల్, "కరీ కింగ్" గులామ్ నూన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్‌పి. హిందుజా, నాథ్ పురి, జోగిందర్ సాంగర్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments