Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై మేము ఒత్తిడి చేయబోము: హిల్లరీ

Webdunia
అమెరికా విదేశాంగ కార్యదర్శిగా భారత్‌లో తొలిసారి అడుగుపెడుతున్న హిల్లరీ క్లింటన్ శుక్రవారం మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో చర్చల విషయంలో తాము మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి తీసుకురాబోమని స్పష్టం చేశారు. హిల్లరీ క్లింటన్ శుక్రవారం భారత్‌లో అడుగుపెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై చర్చలు జరపాలని తాము ఏ రకంగా భారత్‌పై ఒత్తిడి చేయమన్నారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని అమెరికా ఒత్తిడి చేసే అవకాశం ఉన్నట్లు భారత్‌లో అనుమానాలు లేకుండా చేసేందుకు హిల్లరీ ఈ ప్రకటన చేశారు.

పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న తీవ్రవాద గ్రూపుల ఆటకట్టించేందుకు పాకిస్థాన్‌కు కొంత సమయం ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలిసారి అమెరికా విదేశాంగ కార్యదర్శిగా భారత పర్యటన చేపట్టిన హిల్లరీ క్లింటన్ ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ.. ఆసియా ప్రాంతంలో భారత్ తమకు కీలక భాగస్వామి అని తెలిపారు.

భారత్‌తో చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉంటే తీవ్రవాదంపై పోరు విషయంలో పాకిస్థాన్ నిబద్ధత చూపుతోందని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం తీవ్రవాదులపై జరుపుతున్న పోరాటం ఆ దేశ ప్రజలకు విశ్వాసం కలుగుతోందని, పాకిస్థాన్ సరైన మార్గంలోనే వెళుతున్నట్లు తాము భావిస్తున్నామని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments