Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు అమెరికా సెనెటర్ క్షమాపణ

Webdunia
అమెరికా భద్రతకు భారత్ వలన ముప్పు ఉందంటూ వ్యాఖ్యానించినందుకు ఓ అమెరికా సెనెటర్ క్షమాపణ చెప్పారు. చైనాకు బదులుగా భారత్ పేరును తప్పుగా వాడానని, ఇందుకు క్షమాపణ చెబుతున్నట్లు సెనెటర్ జాన్ కార్నైన్ తెలిపారు. ఆయనకు భారత్ అనుకూలవాదిగా పేరున్నప్పటికీ, భారత్ వలన తమ దేశ భద్రతకు ముప్పు పెరుగుతోందని వ్యాఖ్యానించి ఆదివారం వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం నిలిపివేసిన ఎఫ్- 22 కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో డిమాండ్ చేసిన జాన్ కార్నైన్.. అమెరికాకు ఈ రకం యుద్ధ విమానాల కావాలన్నారు. ఉత్తర కొరియా, ఇరాన్, భారత్ వంటి దేశాల నుంచి దేశ భద్రతకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయరక్షణ కోసం అమెరికాకు ఈ యుద్ధ విమానాల అవసరం ఉందని పేర్కొన్నారు.

చైనాకు బదులుగా భారత్‌ను తమ దేశ భద్రతకు ముప్పుగా వర్ణించానని తాజాగా కార్నైన్ వివరణ ఇచ్చారు. కార్నైన్ గత కొన్నేళ్లుగా భారత్- అమెరికా సంబంధాలు పటిష్ట పరచడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాకుండా చారిత్రాత్మక అమెరికా- భారత్ పౌర అణు సహకార ఒప్పందం ముందుకు తీసుకురావడంలోనూ ఆయనది ముఖ్యభూమిక. భారత్, అమెరికా వ్యూహాత్మక సంబంధాలు ప్రోత్సహిస్తున్న ప్రధాన మద్దతుదారుల్లో ఆయన కూడా ఒకరు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments