Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ సంతతి రామకృష్ణన్‌కు నోబెల్ పురస్కారం

Webdunia
భారతీయ సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త వెంకటరామన్ రామకృష్ణన్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

జీవకణాల్లో ప్రొటీన్ల ఉత్పత్తికి కారణమయ్యే రైబోజోమ్స్‌ల ఉనికిని పరమాణువుల స్థాయిలో కనిపెట్టినందుకుగాను రామకృష్ణన్‌కు మరో ఇద్దరితో కలిపి ఈ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన థామస్‌స్టీజ్, ఇజ్రాయెల్‌కు చెందిన అదా ఈయోనాలకు కూడా రామకృష్ణన్‌తో పాటు నోబెల్ బహుమతి లభించింది.

వీరి పరిశోధనలు ఔషధరంగంలో విప్లవాత్మకమార్పులకు దారితీస్తాయని నోబెల్ బహుమతికి అర్హులను ఎంపికచేసే రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రశంసించింది.

రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన నాలుగవ మహిళ అదా ఈ యోనా. 1964 తరువాత ఈ పురస్కారం పొందిన మహిళ ఈమె కావటం విశేషం.

ఇదిలావుండగా వెంకటరామన్ రామకృష్ణన్‌ తమిళనాడులోని చిదంబరంలో 1952లో జన్మించారు. 1971లో బరోడా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్‌సీ ఫిజిక్స్‌లో పట్టా పుచ్చుకున్నారు.

అలాగే ఓహియో విశ్వవిద్యాలయం నుంచి 1976లో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర విభాగంలో చేరి తరగతులు నిర్వహించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

Show comments