Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులపై దాడులతో దేశ పరువు పోయింది: ఆసీస్

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2010 (14:06 IST)
స్వదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న భారతీయులపై జరిగిన దాడుల వల్ల ప్రపంచంలో ఆస్ట్రేలియా పరువు పోయిందని ఆ దేశ విదేశాంగ మంత్రి స్టీఫెన్ స్మిత్ అన్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు ఆయన వెల్లడించారు. దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయన్నారు. ఈ దాడుల్లో కొన్ని జాతి వివక్షాపూరితమైనవిగా ఉన్నాయని తెలిపారు.

దాడుల్లో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు దేశం తరపున ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలుపుతున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా దేశంలోని భారతీయ విద్యార్థులు లేదా పౌరులపై జరుగుతున్న దాడుల్లో జాతివివక్ష దాగి ఉందన్నారు. కేవలం ఈ దాడులు కేవలం విద్యా సంబంధాలపైనే కాకుండా, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయని స్మిత్ అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా, భారతీయులపై జరిగిన దాడులను విక్టోరియా రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత తీవ్రంగా ఖండించారు. సోమవారం భారతీయ పారిశ్రామికవేత్తలతో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రతిపక్ష నేత టెట్ బొయ్‌లివ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని భారతీయులపై జరుగుతున్న దాడుల వల్ల విక్టోరియా ప్రాంతానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. ఇలాంటి దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

'థామా' నుంచి నువ్వు నా సొంతమా పాట రిలీజ్

Geethamadhuri : కానిస్టేబుల్ లో గీతామాధురి పాడిన ధావత్ సాంగ్ కు ఆదరణ

Dil Raju: తేజసజ్జా తో దిల్ రాజు చిత్రం - ఇంటికి పిలిచి ఆత్మీయ వేడుక జరిపాడు

Anupam Kher: కాంతార ఛాప్టర్ 1 చూశాక మాటలు రావడంలేదు : అనుపమ్ ఖేర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

Show comments