Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రతా మండలిలో స్థానం కల్పించండి: భారత్

Webdunia
జీ-8 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటలీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి స్థానం కల్పించాలని జీ-8దేశాలకు విజ్ఞప్తి చేశారు.

అంతర్జాతీయ సమస్యల పరిస్కారంకోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో కీలక సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రపంచదేశాలను కోరారు.

అలాంటి సంస్థల్లో భారత్‌ సముచిత స్థానాన్ని కోరుకుంటుందని ఆయన తెలిపారు. ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.

భారత్ చేసిన విజ్ఞప్తిని బ్రిటన్ ప్రధాని గోర్డన్ బ్రౌన్ భద్రతామండలిలో భారత్‌కు స్థానం కల్పించాలన్న మన్మోహన్ సింగ్ డిమాండ్‌కు మద్దతు పలికారు.

ఈ సందర్భంగా బ్రౌన్ మాట్లాడుతూ... భారతదేశం 21వ శతాబ్దపు శక్తిగా ఎదుగుతోందని ఆయన కొనియాడారు. తమ ఇరుదేశాలు కలిసి అంతర్జాతీయ స్థాయిలో చర్చించి అభివృద్ధి దిశగా పయనించేందుకు అన్ని విధాల కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

దీంతోపాటు ప్రపంచంలోని పలు సమస్యలపైకూడా తాము దృష్టి సారించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments